పెదపూడిని కాకినాడ జిల్లాలో కలపాలని దీక్ష

ABN , First Publish Date - 2022-01-29T05:32:50+05:30 IST

జిల్లాల పునర్విభజనలో భాగంగా పెదపూడి మండ లాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పెదపూడి ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

పెదపూడిని కాకినాడ జిల్లాలో కలపాలని దీక్ష

పెదపూడి, జనవరి 28: జిల్లాల పునర్విభజనలో భాగంగా పెదపూడి మండ లాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పెదపూడి ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీ డబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ సలీం, పాత్రికేయులు వుండ్రు సత్యనారా యణ, వాసంశెట్టి సూరిబాబు, అప్పసాని సోమరాజు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి విలేకరులకు సంఘీభావం తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ కేతా తులసి, వైస్‌ ఎంపీపీ కరెడ్ల వెంకన్నబాబు, జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు మోకా సూరిబాబు, వైసీపీ మండల కన్వీనర్‌ గాజంగి వెంకటరమణ, సర్పంచ్‌లు మీనవల్లి శారదాదేవి, కోసూరి వాసు, నూని పట్టాభిరామయ్య చౌదరి, కొటికలపూడి చినబాబు, మార్ని వెంకట్రావు, సొసైటీ చైర్మన్‌ మార్ని కామరాజు చౌదరి, గుండా ఈశ్వరరావు, ఎంపీటీసీలు సమ్మంగి దుర్గాప్రసాద్‌, పేపకాయల వెంకటరమణ ఉన్నారు. పాత్రికేయుల దీక్షకు జనసేన అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, నాయకులు రావాడ నాగు, పాటంశెట్టి కాశీరాణి, నాగిరెడ్డి వీరాస్వామి, టీడీపీ నాయకులు జుత్తుగ కృష్ణ, పుట్టా గంగాధర చౌదరి, కరకుదురు దత్తుడు, చిర్రా వరప్రసాదరావు, సర్పంచ్‌ కలవల కృష్ణమూర్తి, జుత్తుగ సూరిబాబు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2022-01-29T05:32:50+05:30 IST