జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనం
ABN , First Publish Date - 2020-08-04T11:35:38+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం సర్వ నాశనం అవడానికి కారకులయ్యారని మాజీ ఉప ముఖ్య మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అ న్నారు.
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
సామర్లకోట, ఆగస్టు 3: ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రం సర్వ నాశనం అవడానికి కారకులయ్యారని మాజీ ఉప ముఖ్య మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అ న్నారు. అచ్చంపేటలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసు కుంటారో తెలియదని అన్నారు. స్వప్రయోజనాల కోసం రా ష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు. 3 రాజధానుల నిర్ణయం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి విఘాతమన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు.
ప్రైవేటు వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యంగా మారిందన్నారు. కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ చేసి మిగిలిన కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడం లేదన్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి సరైన దహన సంస్కారాలకు నోచుకోవడం లేదన్నారు. ఆస్పత్రి మార్చురీలో శవాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలు శ్యానిటైజర్ తాగి చనిపోతున్నారన్నారు. చీప్ లిక్కర్ను శానిటైజ్ సీసాలో నింపి అమ్మడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు.