పెందుర్తిని విశాఖలోనే ఉంచాలి

ABN , First Publish Date - 2022-01-29T05:22:25+05:30 IST

విశాఖ నగరానికి ఆనుకుని వున్న పెందుర్తి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న అనకాపల్లి జిల్లాలో కాకుండా విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ కోరారు.

పెందుర్తిని విశాఖలోనే ఉంచాలి
ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి వినతి పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

పెందుర్తి, జనవరి 28: విశాఖ నగరానికి ఆనుకుని వున్న పెందుర్తి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న అనకాపల్లి జిల్లాలో కాకుండా విశాఖ జిల్లాలోనే కొనసాగించాలని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ కోరారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడలో ప్రభుత్వ ప్లానింగ్‌ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలోనే ఎందుకు ఉంచాలనే దానిపై నివేదిక రూపంలో వివరించారు. విశాఖ జిల్లాతో పెందుర్తి నియోజకవర్గ ప్రాంతం భౌగోళిక, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక పరంగా ముడిపడి ఉన్న ముఖ్యాంశాలు విశదీకరించారు. పెందుర్తి నియోజకవర్గంలో తొమ్మిది జీవీఎంసీ వార్డులున్నాయని తెలిపారు. ప్లానింగ్‌ శాఖ కార్యదర్శితో పాటు సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డికి కూడా ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-01-29T05:22:25+05:30 IST