పెన్షనర్ల విభాగం జిల్లా అధ్యక్షుడిగా కేశవరెడ్డి
ABN , First Publish Date - 2021-12-02T06:04:11+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పెన్షనర్ల విభాగాన్ని బుధవారం ఏర్పాటు చేశారు.
గుంటూరు(తూర్పు), డిసెంబరు1: ప్రభుత్వ ఉద్యోగుల సంఘ పెన్షనర్ల విభాగాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ వద్ద ఉన్న ఉద్యోగుల సంఘ కార్యాలయంలో బుధవారం జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడిగా పి.కేశవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ మట్టయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులుగా కాంతారావు, శివయ్య, ప్రసాదరావు, కోశాధికారిగా సైదులను ఎన్నుకున్నారు. వారిని సయ్యద్ చాంద్బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అమ్మయ్య, సంఘ సభ్యులు శేషారావు, శ్రీనివాస్, పీటర్ డానియేల్ అభినందించారు.
8న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు కలెక్టర్ వివేక్యాదవ్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఈనెల 8వతేదీ సాయంత్రం 3గంటలకు సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.