ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి

ABN , First Publish Date - 2022-01-27T05:36:43+05:30 IST

కరోనాతో అప్రమత్తంగా ఉండి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని డీఎంహెచ్‌వో కోటా చలం సూచించారు.

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో కోటా చలం

తిరుమలగిరి, జనవరి23: కరోనాతో  అప్రమత్తంగా ఉండి ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని డీఎంహెచ్‌వో కోటా చలం సూచించారు. తిరుమలగిరి పీహెచ్‌సీని బుధవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకున్నారు. రెండో డోసు కరోనా వ్యాక్సిన్‌ 100శాతం త్వరగా  పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. 15 నుంంచి 17 ఏళ్ల వారు ఖచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. వైద్యసిబ్బంది చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేకు సహకరించాలన్నారు.  ప్రభుత్వ ఆసుత్రుల్లో కాన్పులు పెరిగేలా చూడాలన్నారు.  కార్యక్రమంలో సీహెచ్‌వో బిచ్చునాయక్‌, సూపర్‌ వైజర్‌ రామచంద్రు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T05:36:43+05:30 IST