గడ్డకట్టే చలిలోనూ ఓటేసిన హిమాచల్వాసులు
ABN , First Publish Date - 2021-01-18T07:18:51+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ ప్రజలు గడ్డకట్టే చలిలోనూ ఓటేసి స్ఫూర్తిని చాటారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఆదివారం
సిమ్లా, జనవరి 17: హిమాచల్ ప్రదేశ్ ప్రజలు గడ్డకట్టే చలిలోనూ ఓటేసి స్ఫూర్తిని చాటారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఆదివారం తొలి విడత పోలింగ్ జరిగింది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలోనూ 70ు పోలింగ్ నమోదవడం విశేషం. ముఖ్యంగా -7 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన కాజా బ్లాక్లో 63ు మంది ఓటు వేశారు. రాష్ట్రంలోని 3,615 గ్రామ పంచాయతీలకు గాను ఆదివారం 1,227 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. దేశంలోనే అత్యంత ఎక్కువ వయసు కలిగిన ఓటరు శ్యామ్ సరన్ నేగీ(103).. కల్పా పోలింగ్ బూతులో ఓటేశారు.