అక్రమ మైనింగ్పై తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-03T05:35:46+05:30 IST
మండలంలోని చెర్లోపల్లె గ్రామ పరిధిలోని 707 సర్వే నెంబర్లోని అక్రమ మైనింగ్పై తనిఖీలు నిర్వహించినట్లు మైనింగ్ ఏడీ వేణుగోపాల్ బుధవారం తెలిపారు.
అవుకు, డిసెంబరు 2: మండలంలోని చెర్లోపల్లె గ్రామ పరిధిలోని 707 సర్వే నెంబర్లోని అక్రమ మైనింగ్పై తనిఖీలు నిర్వహించినట్లు మైనింగ్ ఏడీ వేణుగోపాల్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమ శాఖకు అందిన ఫిర్యాదుల మేరకు అక్రమ మైనింగ్పై తనిఖీలు జరిపామన్నారు. సూర్య నాగిరెడ్డి అనే వ్యక్తికి చెందిన మైనింగ్ లీజు గడువు 6 నెలల క్రితం ముగిసిందన్నారు. ప్రభుత్వానికి మైనింగ్ లీజు కోసం ధరఖాస్తు చేసుకోగా పెండింగ్లో ఉందన్నారు. లీజు మంజూరయ్యే వరకు మైనింగ్ నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అయితే ప్రజా సంఘాల నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. లీజు మంజూరు కాకపోయిన్పటికీ అక్రమ మైనింగ్ జరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా, మైనింగ్ ప్రాంతంలోని నాపరాతి కటింగ్ మిషన్లు, నాపరాతిని తరలించే ట్రాక్టర్లు ఉన్నప్పటీకీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకోక పోవటంలోని ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు అధికారులను నిలదీశారు. తమ కార్యాలయానికి వస్తే తగిన సమాచారం ఇస్తామని అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.