బాధ్యతగా విధులు నిర్వహించాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2021-07-29T04:50:32+05:30 IST
ప్రతిఒక్కరూ సమయపాలన పాటిస్తూ సమర్థవంతంగా విధుల నిర్వర్తించాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాలులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధికారులతో పరిచయ కార్యక్రమం జరిగింది.
కడప(కలెక్టరేట్), జూలై 28: ప్రతిఒక్కరూ సమయపాలన పాటిస్తూ సమర్థవంతంగా విధుల నిర్వర్తించాలని కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాలులో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధికారులతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా శాఖల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల్లో పురోగతి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు, ఆయా అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు సక్రమంగా నిర్వర్తించాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసి జిల్లా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్ వర్మ, ధర్మచంద్రారెడ్డి, డీఆర్వో మలోల, సబ్ కలెక్టర్లు కేతన్గార్గ్, పృథ్వీతేజ్, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు, ఏవో గంగయ్య తదితరులున్నారు.