జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నాని

ABN , First Publish Date - 2022-04-20T07:08:08+05:30 IST

జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నానీని నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నాని

మచిలీపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పేర్ని నానీని నియమిస్తూ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీ వరకు మంత్రివర్గంలో పనిచేసిన పేర్ని నానీకి పార్టీ పదవి ఇస్తారనే ప్రచారం ముందు నుంచీ జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు రీజనల్‌ కో-ఆర్డినేటర్‌గా మర్రి రాజశేఖర్‌ను నియమించారు. కృష్ణాజిల్ల్లాకు చెందిన కొడాలి నానీని గుంటూరు, పల్నాడు జిల్లాలకు రీజనల్‌ కో-ఆర్డినేటర్‌గా నియమించారు.  


Updated Date - 2022-04-20T07:08:08+05:30 IST