పట్టుదలే విద్యార్థుల భవిష్యతకు పెట్టుబడి : భాస్కర్రావు
ABN , First Publish Date - 2021-10-18T05:53:18+05:30 IST
దీక్షా, పట్టుదలతో చదవడమే విద్యార్థుల ఉజ్వల భవిష్యతకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
మిర్యాలగూడ, అక్టోబరు 17 : దీక్షా, పట్టుదలతో చదవడమే విద్యార్థుల ఉజ్వల భవిష్యతకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గిరిజన కోటాలో ఆల్ఇండియా స్థాయిలో ఐఐటీ 167వ ర్యాంకును సాధించిన కేతావత సాయిచరణ్ను ఆదివారం క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు. ఉన్నత స్థానంలో నిలవాలనే పట్టుదలే సాయికిరణ్ను దేశ స్థాయిలో ర్యాంకర్గా నిలబెట్టిందన్నారు. చదువుకోవాలనే తపన కలిగిన విద్యార్థులకు తమ వంతు సహయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మాలోతు రాణిశ్రీను తదితరులు పాల్గొన్నారు.