ఢిల్లీ వాసులందరికీ ఉచిత కొవిడ్ చికిత్సా?
ABN , First Publish Date - 2020-07-01T08:25:08+05:30 IST
ఢిల్లీలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు ధనిక, పేద తారతమ్యం పాటించకుండా అందరికీ ఉచితంగా కొవిడ్ పరీక్షలు, చికిత్స చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు విచారణకు నిరాకరించింది...
- వ్యాజ్యం విచారణకు ఢిల్లీ హైకోర్టు తిరస్కృతి
న్యూఢిల్లీ, జూన్ 30: ఢిల్లీలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లు ధనిక, పేద తారతమ్యం పాటించకుండా అందరికీ ఉచితంగా కొవిడ్ పరీక్షలు, చికిత్స చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు విచారణకు నిరాకరించింది. బాధ్యతతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను వేయాలని సీజే డీఎన్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్కు హితవు చెప్పింది. ధనవంతులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ వ్యాజ్యం దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే జరిమానా విధించి కొట్టివేస్తామని హెచ్చరించింది.