చేపలు కొంటే పెట్రోల్ ఫ్రీ!
ABN , First Publish Date - 2021-08-03T06:43:17+05:30 IST
తమిళనాడులోని మదురైకు చెందిన ఓ వ్యాపారి వినూత్న రాయితీ ఇచ్చాడు. తన
చెన్నై, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మదురైకు చెందిన ఓ వ్యాపారి వినూత్న రాయితీ ఇచ్చాడు. తన వద్ద రూ.500 విలువ చేసే చేపలు కొన్న వారికి లీటరు పెట్రోల్ కూపన్ను ఉచితంగా ఇచ్చాడు. దీంతో పీపీకుళం ప్రాంతంలోని ఆ చేపల దుకాణానికి జనం ఎగబడుతున్నారు. టోకెన్లో పేర్కొన్న పెట్రోలు బంక్ వద్దకు వాహనంతో వెళ్తే లీటర్ పెట్రోలు ఉచితంగా పోస్తుండడం విశేషం.