యాత్రీకులపై నిర్లక్ష్యం వీడాలి
ABN , First Publish Date - 2021-01-27T06:34:06+05:30 IST
యాత్రీకులపై నిర్లక్ష్యం వీడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్తో మంగళవారం బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
- అభిషేక పూజలు ప్రారంభించాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ
వేములవాడ, జనవరి 26 : యాత్రీకులపై నిర్లక్ష్యం వీడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్తో మంగళవారం బీజేపీ నేతలు సమావేశమయ్యారు. యత్రీకుల సమస్యలపై చర్చించారు. నిత్యం వేలాది మంది యాత్రీకులు వస్తున్నా కనీస వసతులు కల్పించడం లేదని, కరోనా నిబంధనలు గాలికి వదిలేశారని అన్నారు. అభిషేక పూజలు ప్రారంభించాలని, త్యాగరాజ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశంయాదవ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ బీజేపీ అధ్యక్షుడు రేగుల సంతోష్బాబు, నాయకులు గోపు బాలరాజు, నందిపేట సుదర్శన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.