సచిన్ బీజేపీతోనే ఉన్నారు : పీ.ఎల్. పూనియా
ABN , First Publish Date - 2020-07-13T16:37:01+05:30 IST
ముఖ్యమంత్రి గెహ్లాట్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్పై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది.
జైపూర్ : ముఖ్యమంత్రి గెహ్లాట్పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్పై కాంగ్రెస్ విమర్శల దాడిని పెంచింది. సచిన్ పైలెట్ ప్రస్తుతం బీజేపీతో ఉన్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ.ఎల్. పూనియా ఆరోపించారు. కాంగ్రెస్ విషయంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. బీజేపీ నుంచి తమకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని, కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను, నేతను కాంగ్రెస్ గౌరవిస్తుందని పూనియా ప్రకటించారు.