ప్రణాళికబద్ధంగా ‘మార్కెట్‌’ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-01-21T06:13:09+05:30 IST

ప్రణాళికబద్ధంగా పటాన్‌చెరు సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు.

ప్రణాళికబద్ధంగా ‘మార్కెట్‌’ అభివృద్ధి
పాలకమండలితో సమీక్ష నిర్వహిస్తున్న మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి


పటాన్‌చెరు, జనవరి 20: ప్రణాళికబద్ధంగా పటాన్‌చెరు సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. మార్కెట్‌ అభివృద్ధిపై బుధవారం కమిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ హారికావిజయ్‌కుమార్‌, డైరెక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 14ఎకరాల సువిశాలమైన స్థలంలో సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. సీసీ కెమెరాలు, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్‌, లైటింగ్‌ ఏర్పాట్లకు ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ  డైరెక్టర్లు మల్లారెడ్డి, ప్రమోద్‌గౌడ్‌, వంగరి అశోక్‌, నరసింహ, గౌరీశంకర్‌, అతిక్‌, శివారెడ్డి, రమేష్‌, మల్లేష్‌, మార్కెటింగ్‌ ఏడీ మాధవరెడ్డి, కార్యదర్శి మహబూబ్‌ పాల్గొన్నారు.


రైతు కుటుంబానికి బీమా చెక్కు అందజేత


జిన్నారం, జనవరి 20: జిన్నారానికి చెందిన రైతు మేదరి అశోక్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. అతడి కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా మంజూరైన రూ.5లక్షల చెక్కు ప్రొసీడింగ్‌ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, ఉప సర్పంచ్‌ సంజీవ, నాయకులు శ్రీనివా్‌సరెడ్డి, బోజిరెడ్డి, నరేష్‌, రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజేశ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T06:13:09+05:30 IST