చిత్తూరు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

ABN , First Publish Date - 2021-08-27T17:01:15+05:30 IST

చిత్తూరు జిల్లా: కుప్పం, ఎన్టీఆర్ కాలనీలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది.

చిత్తూరు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

చిత్తూరు జిల్లా: కుప్పం, ఎన్టీఆర్ కాలనీలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించిన రేషన్ బియ్యంతో వండిన అన్నం తిని చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు. వాంతులు చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ బియ్యానికి నిప్పు పెడితే కర్పూరంలా కాలి మసిఅవుతోందని, నీటిలో వేస్తే పైకి తేలుతున్నాయని ఇలాంటి బియ్యంతో వండిన అన్నాన్ని ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు.


ఈ బియ్యంతో వండిన అన్నం తిని తమ బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారని, ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని మంచి రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని కోరుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-27T17:01:15+05:30 IST