మా జీవితాలతో ఆడుకోవడం తగదు
ABN , First Publish Date - 2020-05-30T09:24:04+05:30 IST
అమరావతికి భూములిచ్చిన చిన్నసన్నకారు రైతుల జీవితాలతో ఆడుకోవటం ప్రభుత్వానికి తగదని శుక్రవారం
164వ రోజు ఆందోళనలో అమరావతి రైతులు
గుంటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): అమరావతికి భూములిచ్చిన చిన్నసన్నకారు రైతుల జీవితాలతో ఆడుకోవటం ప్రభుత్వానికి తగదని శుక్రవారం రాజధాని 29 గ్రామాల్లో 164వ రోజు జరిగిన ఆందోళనల్లో రైతులు, మహిళలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో తమ బతుకులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఈసీ వ్యవహారంలో హైకోర్టు స్పందించినట్లే త్వరలో అమరావతిపైనా తీర్పు ఇస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరాతితోనే రాష్ట్రానికి వెలుగంటూ అమరావతి వెలుగు కార్యక్రమం చేపట్టారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలు 38వ రోజుకు చేరుకున్నాయి.