టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందు
ABN , First Publish Date - 2021-06-20T06:35:58+05:30 IST
టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందును పంపిణీ చేసే కార్యక్రమాన్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు.
ప్రారంభించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఉద్యోగులకు ఆనందయ్య మందును పంపిణీ చేసే కార్యక్రమాన్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రారంభించారు. ఇటీవల టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు ఆనందయ్యను కలిసి మందును కోరిన విషయం తెలిసిందే. స్పందించిన ఆనందయ్య తన మందును అందించారని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు చీర్ల కిరణ్, బచ్చల హేమలత, చింతల శివకుమార్, వాసు, తదితరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగనాయక్, పార్థసారథి, లోకాచారి, సురేశ్, శైలేంద్ర కుమార్ యాదవ్, రేఖ, గంగధర్రావు, లక్ష్మీదేవి, తులసమ్మ, రాజ్కుమార్, మణికంఠ, యుగందర్ రెడ్డి, శివప్రసాద్, శివ, పవన్, భరత్, ధరణికుమార్, మురళీ, ప్రియవర్దన్ బాబు, తేజేశ్వర్, అంకయ్య, శ్రీహరి, బాబు తదితరులు పాల్గొన్నారు.