Modi: రాజ్‌నాథ్, అమిత్‌షా, దోవల్‌తో కీలక భేటీ

ABN , First Publish Date - 2021-09-06T23:02:15+05:30 IST

అఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. ఇప్పటికే

Modi: రాజ్‌నాథ్, అమిత్‌షా, దోవల్‌తో కీలక భేటీ

న్యూఢిల్లీ : అఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తూనే ఉంది. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఓ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ హాజరయ్యారు. అఫ్గనిస్తాన్‌లో జరుగుతున్న ప్రస్తుత, తాజా పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-09-06T23:02:15+05:30 IST