ఏడేళ్లుగా అవే ప్రసంగాలు.. ప్రధానిపై కాంగ్రెస్ నేత ఖర్గే విమర్శ

ABN , First Publish Date - 2021-08-15T23:54:48+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆదివారం మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఏడేళ్లుగా దేశ ప్రజలు ప్రధాని చేస్తున్న ఒకే తరహా ప్రసంగాలను వింటున్నారని, ఇవేవీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదని మండిపడ్డారు.

ఏడేళ్లుగా అవే ప్రసంగాలు.. ప్రధానిపై కాంగ్రెస్ నేత ఖర్గే విమర్శ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఏడేళ్లుగా దేశ ప్రజలు.. ప్రధాని చేస్తున్న ఒకే తరహా ప్రసంగాలను వింటున్నారని,  ఇప్పటివరకూ ఆయన ఇచ్చిన హామీలేవీ కార్యరూపం దాల్చలేదని ఆదివారం నాడు ఆయన మండిపడ్డారు. ‘‘తరచూ పలు ప్రసంగాలు చేస్తుంటారు..కానీ వాటికి కట్టుబడి ఉండరు’’ అని కామెంట్ చేశారు. కొత్త చట్టాలతో రైతులపైకి మరో ఉపద్రవాన్ని తెచ్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్ దేశ ప్రజల కోసం ఎంతో చేసిందని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-08-15T23:54:48+05:30 IST