అమిత్ షా, బీజేపీ చీఫ్‌తో సమావేశమైన మోదీ

ABN , First Publish Date - 2021-06-12T00:34:15+05:30 IST

కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో ప్రధాని నరేంద్రమోదీ ఆయన నివాసంలో

అమిత్ షా, బీజేపీ చీఫ్‌తో సమావేశమైన మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో ప్రధాని నరేంద్రమోదీ ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమైన వెంటనే అమిత్ షా, నడ్డాతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా అమిత్ షా, జేపీ నడ్డాలతో నేడు భేటీ అయ్యారు. షా, నడ్డాతో మోదీ సమావేశం ప్రస్తుతం కొనసాగుతోంది. యూపీలో అసమ్మతి వార్తలు, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు పశ్చిమ బెంగాల్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలపై సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-06-12T00:34:15+05:30 IST