పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-08-03T04:22:18+05:30 IST
తక్షణమే పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, ఆగస్టు 2: తక్షణమే పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్లోని రౌటసంకెపల్లి, అప్పపల్లి, పర్సనంబాల, ఎడవెల్లి తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ఆగస్టు 4నుంచి 8వరకు జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు పోడు యాత్ర నిర్వహిస్తున్నామని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సుశీల, బద్రి సత్యనారాయణ, గణేష్, చిరంజీవి, హన్మంతు, మల్లికార్జున్, అచ్యుత్ రావు పాల్గొన్నారు.