పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-01-21T05:01:20+05:30 IST

కేంద్రం వెనక్కి తీసుకున్న నిధుల్లో నిర్వాసితుల నిధులు తిరిగి ఇచ్చి ఆదుకోవాలని ఐక్య వేదిక నాయకులు కోరారు.

పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలి
నిరసన దీక్ష శిబిరంలో నాయకులు

పోలవరం, జనవరి 20: కేంద్రం వెనక్కి తీసుకున్న నిధుల్లో నిర్వాసితుల నిధులు తిరిగి ఇచ్చి ఆదుకోవాలని ఐక్య వేదిక నాయకులు కోరారు. నిర్వాసితుల దీక్షలు గురువారం 42వ రోజుకు చేరాయి. నిర్వాసితుల ఐక్యవేదిక నాయకుడు గెల్లా రాజేష్‌ మాట్లాడుతూ సదుపాయాలు, పరిహారాలు ఇవ్వకుండా బలవంతంగా తరలించడంతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారని, 42 రోజులుగా దీక్షలు చేస్తున్న స్పందన లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ మహాసభ నాయకుడు కారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితులకు న్యాయం జరిపించాలని మాజీ ఎంపి, న్యాయవాది ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను కోరామన్నారు. సర్పంచ్‌ రామ్‌గోపాల్‌, ఎం.వెంకటేశ్వరరావు, శివాజీ, కె.సత్యనారాయణ, వీరపురాజు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:01:20+05:30 IST