రెండో రోజు కొనసాగిన పోలీస్‌ అర్హత పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-04T05:25:28+05:30 IST

పెదవేగిలోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైన ఎస్‌ఐ అర్హత పరీక్షలు రెండోరోజు గురువారం కొనసాగాయి.

రెండో రోజు కొనసాగిన పోలీస్‌ అర్హత పరీక్షలు

పెదవేగి, డిసెంబరు 3 : పెదవేగిలోని జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైన ఎస్‌ఐ అర్హత పరీక్షలు రెండోరోజు గురువారం కొనసాగాయి. ఏలూరు రేంజ్‌ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణాజిల్లా, విజయవాడ సిటీనుంచి మొత్తం 76మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు ఎస్‌ఐ పదోన్నతి కోసం అర్హత పరీక్షల్లో పాల్గొన్నారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ.మోహనరావు, ఎస్పీ కే.నారాయణ నాయక్‌లు పర్యవేక్షించారు. డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, సీఐ రామారావు, ఇతర పోలీస్‌ అధికారులు పర్యవేక్షించారు.

Updated Date - 2020-12-04T05:25:28+05:30 IST