కమిషనరేట్‌లో ఇద్దరికి పోలీస్‌ మెడల్స్‌

ABN , First Publish Date - 2021-01-26T07:01:00+05:30 IST

విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరికి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం) దక్కింది.

కమిషనరేట్‌లో ఇద్దరికి పోలీస్‌ మెడల్స్‌

విజయవాడ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇద్దరికి ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ (ఐపీఎం) దక్కింది. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జి.వి.రమణమూర్తి, ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వై.నాగేశ్వరరెడ్డి ఈ పతకాలకు ఎంపికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన రమణమూర్తి 1989లో ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఆయనకు 136 గుడ్‌ సర్వీస్‌ ఎంట్రీలు, 116 నగదు రివార్డులు ఉన్నాయి. నాగేశ్వరరెడ్డి 1990లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఆయనకు 20 గుడ్‌ సర్వీస్‌ ఎంట్రీలు, 19 నగదు రివార్డులు ఉన్నాయి. వారిని పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు అభినందించారు.

Updated Date - 2021-01-26T07:01:00+05:30 IST