పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-10-22T05:18:48+05:30 IST

కడియం మండలం బుర్రిలంకలో పేకాట శిబిరంపై ఈనెల 20వ తేదీ రాత్రి పోలీసులు దాడి చేశారు.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

  • 23 మందిపై కేసు.. రూ.2,15,510 నగదు.. 23 బైక్‌లు 18 సెల్‌ఫోన్లు స్వాధీనం

కడియం, అక్టోబరు 21: కడియం మండలం బుర్రిలంకలో పేకాట శిబిరంపై ఈనెల 20వ తేదీ రాత్రి పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 17 మందిని అదుపులోకి తీసుకుని, 23 మోటారుసైకిళ్ళు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్పెషల్‌ పార్టీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు, కడియం ఇన్‌స్పెక్టర్‌ డి.రాంబాబు, ఎస్‌ఐ ఎస్‌కే అమీనాబేగం, సిబ్బంది బుర్రిలంక ఆదియ్యపుంత రోడ్‌లో ఉన్న ఖాళీ స్థలంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాడుతున్న 17 మందిని అదుపులోకి  తీసుకుని వారి నుంచి రూ.2,15,510 నగదు, 23 మోటార్‌సైకిల్స్‌, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.  మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపారు.

Updated Date - 2021-10-22T05:18:48+05:30 IST