31న పోలియో చుక్కలు
ABN , First Publish Date - 2021-01-26T05:42:36+05:30 IST
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈనెల 31న (ఆదివారం) చిన్నారులకు పోలియో చుక్కలు వేయనుంది.
శృంగవరపుకోట, జనవరి 25: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈనెల 31న (ఆదివారం) చిన్నారులకు పోలియో చుక్కలు వేయనుంది. ఈ మేరకు అందరికీ తెలిసేలా ఈ శాఖ సిబ్బంది సోమవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 17న జిల్లాలో పోలియో చుక్కలు వేయాల్సి ఉంది. అయితే కొవిడ్-19 (కరోనా) వ్యాక్సినేషన్ను ఈనెల 16న ప్రభు త్వం ప్రారంభించడంతో పోలియో చుక్కల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తొలి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్యఆరోగ్య శాఖ, పారిశుధ్య కార్మికులు వంటి ఫ్రంట్లైన్ అధికారులు, సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్ ఇచ్చిన విష యం తెలిసిందే. రెండో విడత కార్యక్రమ వివరాలు ఇంకా రావకపోవడంతో వచ్చే ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం చేపట్టనున్నారు.