ప్రముఖ నటుడు పీసీ జార్జి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-14T17:20:46+05:30 IST

పోలీసు అధికారిగా మంచిపేరు తెచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన ప్రముఖ..

ప్రముఖ నటుడు పీసీ జార్జి కన్నుమూత

తిరువనంతపురం: పోలీసు అధికారిగా మంచిపేరు తెచ్చుకుని, సినిమాల్లోనూ రాణించిన ప్రముఖ మలయాళ నటుడు పీసీ జార్జి శుక్రవారంనాడు త్రిసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. కొద్ది కాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా పదవీ విరమణ చేసిన తర్వాత జార్జి,  పలు మలయాళ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. రంగస్థల అనుభవంతో సినిమాల్లోకి వచ్చినా 80వ దశకం ప్రారంభంలో ఆయనకు తిరువనంతపురంలో  పోస్టింగ్ ఇవ్వడంతో కొద్దికాలం నటనకు బ్రేక్ వచ్చింది. 1988లో మమ్ముట్టి నటించిన 'సంఘం' చిత్రం పీసీ జార్జికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నటుడిగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. పోలీసు అధికారిగా బాధ్యతలు ఉండటంతో సమయం సందర్భం వచ్చినప్పుడుల్లా ఆయన లాంగ్ లీపు తీసుకుంటూ సుమారు 75 చిత్రాల్లో నటించారు. శనివారం త్రిసూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

Updated Date - 2021-05-14T17:20:46+05:30 IST