పాజిటివ్ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-08-05T10:21:27+05:30 IST
కరోనా విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది వైరస్ బారిన పడితే.. అలాంటి వారికి 14 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు ..
గుంటూరు(మెడికల్), ఆగస్టు 4: కరోనా విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది వైరస్ బారిన పడితే.. అలాంటి వారికి 14 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం డీఎంహెచ్వో డాక్టర్ యాస్మిన్ను కలసి వినతిపత్రం అందజేశారు. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ నిర్ధారణ అయితే అన్ని వసతులతో కూడిన ఆసుపత్రుల్లో చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే సుధాకర్, నగర సంయుక్త కార్యదర్శి సాంబశివరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.