ప్రజాసంఘాల నాయకులను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-01-18T05:16:53+05:30 IST
ఉపా చట్టం కింద అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు.
పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్
తాడేపల్లి టౌన్, జనవరి 17: ఉపా చట్టం కింద అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను బేషరతుగా విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం తాడేపల్లి ప్రెస్క్లబ్లో పౌరహక్కుల సంఘం నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 23న గుంటూరులో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నేతలు రాధ, శ్రీరాములు, గంగాధర్రావు, లక్ష్మీకొండారెడ్డి, శ్రీను, రవిచంద్ర, రివేరా, గురునాధరావు తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బి.కొండారెడ్డి కుటుంబాన్ని నేతలు పరామర్శించారు.