విద్యుత్ సవరణ సంస్థకు గొడ్డలిపెట్టు
ABN , First Publish Date - 2020-06-04T10:02:55+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సవరణ బిల్లు-2020 విద్యుత్ సంస్థకు గొడ్డలి పెట్టులాంటిదని రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డి.చంద్రమౌళి
పాలమూరు, జూన్ 3: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ సవరణ బిల్లు-2020 విద్యుత్ సంస్థకు గొడ్డలి పెట్టులాంటిదని రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డి.చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆయన విద్యుత్భవన్లో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. విద్యుత్ ప్రైవేటీకరణతో రైతులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సబ్సిడీలు, ప్రజలకిస్తున్న రాయితీలు పొందలేమన్నారు. పవర్ కొనుగోలు నుంచి ప్రాజెక్టుల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాసే ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమన్నారు. ఈ విషయమై మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఉద్యోగులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు చెప్పారు. ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామన్నారు.