ప్రజాస్వామ్యానికే చీకటిరోజులు : నెలవల
ABN , First Publish Date - 2021-10-21T03:32:51+05:30 IST
టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే చీకటిరోజులని సూళ్లూరుపేట నియోజక
నాయుడుపేట/టౌన్, అక్టోబరు 20 : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే చీకటిరోజులని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన నడుస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, కందల కృష్ణారెడ్డి, కామిరెడ్డి మురళీరెడ్డి, తిరుమూరు సుధాకర్రెడ్డి, ఆకుతోట రమేష్, శ్రీరామ్ ప్రసాద్, అవధానం సుధీర్, దువ్వూరు అశోక్రెడ్డి, దార్ల రాజేంద్ర తదితరులు ఉన్నారు.