ప్రకాశం జిల్లాలో 10 మంది వాలంటీర్ల తొలగింపు

ABN , First Publish Date - 2021-02-24T12:59:12+05:30 IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దేనువుకొండ, మోదేపల్లిలలో 10 మంది వాలంటీర్లను అధికారులు తొలగించారు.

ప్రకాశం జిల్లాలో 10 మంది వాలంటీర్ల తొలగింపు

ఒంగోలు: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దేనువుకొండ, మోదేపల్లిలలో 10 మంది వాలంటీర్లను అధికారులు తొలగించారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ రెండు గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు ఓడిపోయారు. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనే అక్కసుతోనే తమ వారిని తొలగించారని వాలంటీర్ల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే దేనువుకొండలో ఏడుగురు, మోదేపల్లిలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీఓ రాజేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ ఉత్తర్వులను తీసుకునేందుకు వాలంటీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-02-24T12:59:12+05:30 IST