ఒంగోలు రిమ్స్లో విధులు బహిష్కరించిన జనరల్ డ్యూటీ డాక్టర్లు
ABN , First Publish Date - 2021-09-08T19:02:25+05:30 IST
జీతాలు చెల్లించలేదంటూ ఒంగోలు రిమ్స్లో జనరల్ డ్యూటీ డాక్టర్లు నిరసనకు దిగారు.
ప్రకాశం: జీతాలు చెల్లించలేదంటూ ఒంగోలు రిమ్స్లో జనరల్ డ్యూటీ డాక్టర్లు నిరసనకు దిగారు. తమ విధులను బహిష్కరించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా గత 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ డాక్టర్లు ఆందోళనకు దిగారు. మరో 20 రోజుల్లో తమ కాంట్రాక్టు సమయం పూర్తి కావస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ జనరల్ డ్యూటీ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.