ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-11-22T14:49:47+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ముందు వెళ్తున్న లారీని పెళ్లి బృందంతో వెళ్తున్న టెంపో వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యానులో చిక్కుకున్న నలుగురిని బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తిరుపతిలో వివాహం చేసుకుని తెనాలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-22T14:49:47+05:30 IST