Delhiకి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2021-08-31T18:24:44+05:30 IST
ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు ఢిల్లీకి వెళ్లారు.
విజయవాడ: ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు ఢిల్లీకి వెళ్లారు. వెలిగొండ ప్రాజెక్ట్ను గెజిట్ నోటిఫికేషన్లో చేర్చకపోవడంపై నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో కేంద్ర జల్శక్తి మంత్రిని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కలవనున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ను విభజన చట్టంలో పేర్కొన్నారని, అనుమతి ఇవ్వొద్దని ఎలా చెబుతారని గతంలో కేసీఆర్కు టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాసిన విషయం తెలిసిందే. వెలిగొండకు అనుమతి, నిధులు కేటాయించవద్దని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై టీడీపీ నేతలు అభ్యతరం వ్యక్తం చేశారు.