ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిపై కేసు
ABN , First Publish Date - 2020-10-30T04:38:24+05:30 IST
ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆచంట, అక్టోబరు 29 : ప్రేమ పేరుతో మోసగించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచంట ఎస్ఐ సిహెచ్ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం. కరుగోరుమిల్లి గ్రామానికి చెందిన చీకరమిల్లి రఘరామ్ (25) అదే గ్రామానికి చెందిన (19) ఏళ్ళ బాలికతో మూడేళ్లగా నుంచి ప్రేమాయణం సాగించాడు. మైనార్టీ తీరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడు.ఇటీవలే ఆ బాలికకు 19 ఏళ్లు నిండడంతో పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. మోసపోయానని తెలుసుకున్న బాలిక గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం,అత్యాచారం కేసు నమోదు చేశామన్నారు.