ఉమాకు బెయిల్‌ రావాలని పూజలు

ABN , First Publish Date - 2021-08-04T06:00:20+05:30 IST

ఉమాకు బెయిల్‌ రావాలని పూజలు

ఉమాకు బెయిల్‌ రావాలని పూజలు
కొత్తూరు తాడేపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న టీడీపీ నాయకులు

విజయవాడ రూరల్‌, ఆగస్టు 3: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్‌ మంజూరై, త్వరగా జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షిస్తూ కొత్తూరు తాడేపల్లికి చెందిన పార్టీ నాయకులు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం తగదని, ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించమని స్వామిని కోరామని నాయకులు తెలిపారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు బొర్రా పున్నారావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కె.రవికుమార్‌, మాజీ ఉప సర్పంచ్‌ దొంతగాని వెంకటేశ్వరరావు, ముగ్గురాళ్ల నాగరాజు, మెండెం జమలయ్య, గరిమెళ్ల రాంబాబు, అనిల్‌, వంశీ, సూరిబాబు పాల్గొన్నారు.  

కొండపల్లిలో..

ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు బెయిల్‌ రావాలని కొండపల్లిలో టీడీపీ నాయకులు వీరాంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశారు. చుట్టుకుదురు వాసు, వేమూరి అజయ్‌, దొడ్డాకులు వెంకటేశ్వరరావు, చల్లపల్లి శ్రీనివాసరావు, చుక్కపల్లి నాగేశ్వరరావు, వీరంకి కుమార్‌, అందే చిట్టిబాబు, రాజు, చిన్నా పాల్గొన్నారు.

 

Updated Date - 2021-08-04T06:00:20+05:30 IST