Kargil Vijay Divas: వాతావరణం అనుకూలించక రాష్ట్రపతి... ద్రాస్ పర్యటన రద్దు!
ABN , First Publish Date - 2021-07-26T14:44:30+05:30 IST
ఈరోజు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ద్రాస్ పర్యటన రద్దయ్యింది.
న్యూఢిల్లీ: ఈరోజు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ద్రాస్ పర్యటన రద్దయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా రాష్ట్రపతి పర్యటన రద్దయ్యింది. అయితే రాష్ట్రపతి ఈరోజు గుల్మర్గ్లో పర్యటించనున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ దివస్ నిర్వహిస్తున్నారు. ఈ నందర్భంగా రాష్ట్రపతి... కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం రద్దయ్యింది. ఈ రోజు పాకిస్థాన్పై మన దేశం విజయం సాధించిన సందర్భంగా విజయ్ దివస్గా నిర్వహిస్తున్నారు. నేటితో కార్గిల్ విజయ దినోత్సవానికి 22 యేళ్లు పూర్తి అయ్యింది.