సెకండ్‌ డోసుకే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-05-05T06:32:10+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోసు వేయించుకోవాల్సిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు.

సెకండ్‌ డోసుకే ప్రాధాన్యం

నేడో, రేపో కొవాగ్జిన్‌ రాక

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 4 : జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ సెకండ్‌ డోసు వేయించుకోవాల్సిన వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి డోసు వేయించుకొని నెలరోజులు దాటిన వారందరికీ బుధవారం నుంచి సెకండ్‌ డోసు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు లక్షల మందికి మొదటి డోసు వేయగా వారిలో 2.5లక్షల మందికి రెండో డోసు పూర్తి చేశారు. ఇంకా 2.5లక్షలమంది వరకు పెండింగ్‌లో ఉన్నారు. దీంతో మొదటి డోసు వేయించుకునే వారిని కొద్దిరోజులు నిలుపుదల చేసి రెండో డోసు వారికి టీకా ఇవ్వనున్నారు. జిల్లాకు బుధవారం 10వేల డోసులు కొవిషీల్డ్‌ రానుంది. దానిని రెండో డోసు వేసేందుకు వినియోగించనున్నారు. కాగా కొవాగ్జిన్‌ పక్షంరోజుల నుంచి అందుబాటులో లేదు. దీంతో సెకండ్‌ డోసు సమయం దాటిపోతుండటంతో అటువంటి వారందరికీ గురువారం నుంచి వేయనున్నట్లు తెలిసింది. జిల్లాకు ముందుగా 3వేల డోసుల కొవాగ్జిన్‌ రానుందని, ఆ టీకా మొత్తాన్ని సెకండ్‌ డోసుకు వినియోగిస్తామని అధికారుల సమాచారం.



Updated Date - 2021-05-05T06:32:10+05:30 IST