టీఆర్టీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-03-03T05:38:13+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని టీఆర్టీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా తుడందెబ్బ అధ్యక్షుడు గేడం గణేష్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

టీఆర్టీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి2: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని టీఆర్టీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా తుడందెబ్బ అధ్యక్షుడు గేడం గణేష్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వివరించారు. 2017 ఎస్జీటీ టీఆర్టీ తెలుగుమీడియానికి సంబంధించిన ఏజెన్సీ సర్టిఫికెట్ల పరిశీలన చేసే సమయంలో ఫ్రూఫ్‌ షోవిన్‌ డాక్యుమెంట్‌ లేనందున డీఎల్‌ఎస్‌సీ కమిటీ వారు 50 మందిని అనర్హులుగా ప్రకటించారన్నారు. అలాగే 16 మంది ని పెండింగ్‌ జాబితాలో ఉంచారని తెలిపారు. అయితే వారిని ప్రస్థుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారిగా గుర్తించారని తెలిపారు. వీరితో పాటు టీఆర్టీ అభ్యర్థులు రాంచందర్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-03-03T05:38:13+05:30 IST