వైభవంగా దర్గమ్మ ప్రతిమల ఊరేగింపు
ABN , First Publish Date - 2021-10-18T05:59:49+05:30 IST
మదనపల్లె పట్టణంలో పలు వీధుల్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ ప్రతి మలను ఆదివారం సాయంత్రం ఊరేగించారు.
మదనపల్లె అర్బన్, అక్టోబరు 17: పట్టణంలో పలు వీధుల్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మ ప్రతి మలను ఆదివారం సాయంత్రం ఊరేగించారు. సొసైటీకాలనీలో దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మార్పురి విక్రమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ ప్రతి మను ఘనంగా ఊరేగించారు. అమ్మవారి మండపంలో నైవే ద్యంగా సమర్పించిన లడ్డూ వేలం వేయగా రూ.30వేలు పలికింది. శాస్త్రీవీధిలో శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ ప్రతిమను బళ్లారిడ్రమ్ముల వాయిద్యాల నడుమ ఊరేగించారు. బుగ్గకాలువ సమీపంలో ఏర్పాటు చేసిన దర్గమ్మ ప్రత్యేకపూజలు చేసి ఊరేగించారు. శేష మహల్ టాకీస్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మప్రతిమకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ప్రతిమలను బైపాస్రోడ్డు లోని స్వామి చెరువులో నిమజ్జనం చేశారు.