అంతర పంటలతో లాభదాయకం

ABN , First Publish Date - 2021-10-25T05:04:50+05:30 IST

రబీలో సాగైన మినుము పంటలో అంతర్‌ పంటగా కందిపంట సాగు చేయడం ద్వారా రైతులకు మంచి ప్రయోజనం ఉంటుదని వ్యవసాయ అధికారి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నా రు.

అంతర పంటలతో లాభదాయకం
మినుములో అంతర్‌ పంటగా కంది

ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 24: రబీలో సాగైన మినుము పంటలో అంతర్‌ పంటగా కందిపంట సాగు చేయడం ద్వారా రైతులకు మంచి ప్రయోజనం ఉంటుదని వ్యవసాయ అధికారి  అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నా రు. దీర్ఘకాలిక పంట అయిన కంది, స్వల్పకాలిక పంట అయిన మినుము రెండు అంతర పంటగా సాగు చేయడం వలన ఒక పంట నష్టపోయిన రెండవ పంట రైతుకు మేలు చేస్తుందన్నారు. వాతావరణం అనుకూలించి రెండు పంటలు పండినా రైతులకు మంచి గిట్టుబాటు అవుతుందని  తెలిపారు. పత్తిపంటలో కూడా కంది పంట సాగు చేయడం వలన రెండు పంటలు లబ్ధిచేకూరే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి రైతు రాబోయే రోజుల్లో అంతర పంటలపై మొగ్గు చూపాలని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-25T05:04:50+05:30 IST