నిషేధిత పత్తి విత్తనాల పట్టివేత
ABN , First Publish Date - 2020-05-22T11:09:43+05:30 IST
ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను తీసుకెళ్తుండగా, మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి నుంచి ఇచ్చోడకు బైకుపై ఇద్దరు ఒక బ్యాగులో నిషేధిత బీటీ-2 రకం పత్తి
సిరికొండ, మే 21: ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను తీసుకెళ్తుండగా, మండల కేంద్రంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఫరీద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రవెల్లి నుంచి ఇచ్చోడకు బైకుపై ఇద్దరు ఒక బ్యాగులో నిషేధిత బీటీ-2 రకం పత్తి విత్తనాలు తీసుకెళ్తున్నారు. బుధవారం రాత్రి సిరికొండలోని గాంధీ చౌక్ వద్ద పోలీసులు తనిఖీ చేపట్టగా, మోటారు సైకిల్పై వెళ్తున్న వారి నుంచి 50 పత్తి విత్తనాల బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం వ్యవసాయాధికారులు వాటిని పరిశీలించి నిషేధిత పత్తి విత్తనాలుగా నిర్ధారించారు. దీంతో ఉమేష్, సంతోష్, కాంబ్లె అశ్విన్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పత్తి విత్తనాల విలువ దాదాపు 60 వేలు ఉంటుందని సిరికొండ మండల ఇన్చార్జి వ్యవసాయ అధికారి జాదవ్ కైలాస్ తెలిపారు.