కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన

ABN , First Publish Date - 2021-10-24T05:16:49+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన
బీసీ గేటు వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు అన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ శనివారం బీసీ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగాన్ని విక్రయించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నందికి తాతారావు, యెల్లేటి శ్రీనివాసరావు, పల్లేటి పోలయ్య, నమ్మి రమణ, మసేను, రమణ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-24T05:16:49+05:30 IST