జీజీహెచ్లో వైద్య విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-08T05:26:06+05:30 IST
రోగుల బంధువులు తమపై దాడులు చేస్తున్నా రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థులు మంగళవారం జీజీహెచ్లో ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలలని డిమాండ్ చేశారు.
రోగి బంధువులు దాడి చేశారంటూ నిరసన
గుంటూరు(జీజీహెచ్), డిసెంబరు 7: రోగుల బంధువులు తమపై దాడులు చేస్తున్నా రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థులు మంగళవారం జీజీహెచ్లో ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలలని డిమాండ్ చేశారు. వివరాలివి.. గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో ఆదివారం రాత్రి కొందరు యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. వారిలో కొందరు గాయాలతో జీజీహెచ్కి వచ్చారు. గాయాలు లేని వారు బయటకు వెళ్లాలని విధుల్లో ఉన్న జనరల్ సర్జరీ విభాగపు విద్యార్థి కోరారు. ఈ క్రమంలో యువకులు, వైద్యవిద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాలో చూసి కేసు నమోదు చేయాలని కోరారు. దీని పై పోలీసులు, జీజీహెచ్ ఉన్నతాధికారులు సరిగా స్పందించ లేదంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. జేసీ రాజకుమారి అక్కడకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఘర్షణకు దిగిన యువకులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులు విధులకు హాజరయ్యారు.