జీవీఎంసీకి 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేత

ABN , First Publish Date - 2021-06-22T05:49:23+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)కి 50 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఆసరా ఫౌండేషన్‌ ప్రతినిధులు ఉచితంగా అందజేశారు.

జీవీఎంసీకి 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేత
సృజనకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్న ‘ఆసరా’ ప్రతినిధులు

వెంకోజీపాలెం, జూన్‌ 21: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)కి 50 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఆసరా ఫౌండేషన్‌ ప్రతినిధులు ఉచితంగా అందజేశారు. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించాలనే సంకల్పంతో రూ.56 లక్షల విలువైన 50 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ‘ఆసరా’ ప్రతినిధులు సోమవారం జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజనకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించిన ఆసరా ఫౌండేషన్‌ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. వీటిలో 40 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ముడసర్లోవ కొవిడ్‌ సెంటర్‌కు, 10 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఆసరా’ ప్రతినిధులు రామారావు, వినయ్‌, ఏడీసీ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ముడసర్లోవ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:49:23+05:30 IST