కెప్టెన్ అమరీందర్ పార్టీ సింబల్ ఇదే!
ABN , First Publish Date - 2022-01-11T00:15:10+05:30 IST
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రారంభించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ కేటాయించింది.
చండీగఢ్: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రారంభించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ కేటాయించింది. హాకీ స్టిక్, బాల్ తమకు కేటాయించారని అమరీందర్ వెల్లడించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది. పంజాబ్లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ అసెంబ్లీకి 117 స్థానాలున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ మరో నేత నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు ప్రాధాన్యత పెంచి అమరీందర్కు ప్రాధాన్యత తగ్గించింది. అంతేకాదు అమరీందర్ను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించింది. దీంతో ఆయన సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు.