విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు...పంజాబ్ సీఎం వెల్లడి

ABN , First Publish Date - 2020-08-11T11:57:50+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు....

విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు...పంజాబ్ సీఎం వెల్లడి

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. ఈ నెల 12వతేదీన పంజాబ్ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో జనం గుమిగూడకుండా భౌతిక దూరం పాటించేలా స్మార్ట్ ఫోన్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12వతరగతి చదవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందిస్తామని పంజాబ్ సర్కారు గతంలోనే ప్రకటించింది.కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ లో చదువుకుంటున్న విద్యార్థులకు సమస్యగా మారడంతో జన్మాష్టమి రోజు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించాలని సీఎం నిర్ణయించారు. ఆగస్టు 12వతేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం కూడా రావడంతో ఆ సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా 50వేల ఫోన్లను ఇప్పటికే తెప్పించారు.

Updated Date - 2020-08-11T11:57:50+05:30 IST