కరోనా కట్టడికి పంజాబ్ మరిన్ని కఠిన నిర్ణయాలు

ABN , First Publish Date - 2020-07-14T00:31:53+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ

కరోనా కట్టడికి పంజాబ్ మరిన్ని కఠిన నిర్ణయాలు

చండీగఢ్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడడం, పెళ్లిళ్లు, ఇతర సామాజిక వేడుకలపై ఆంక్షలు కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి గుమికూడరాదని, పెళ్లిళ్లు, ఇతర సామాజిక వేడుకల్లో అతిథులు 30కి మించకూడదని ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు 50 మందికి అనుమతిచ్చిన ప్రభుత్వం ఇప్పుడా సంఖ్యను కుదించింది. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించింది. 


Updated Date - 2020-07-14T00:31:53+05:30 IST